Sunday, 10 December 2017

ఏసుక్రీస్తు డిసెంబర్ 25 నే పుట్టాడా ?ఆధారాలు ఉన్నాయా

ఏసుక్రీస్తు డిసెంబర్ 25 నే పుట్టాడా ?ఆధారాలు ఉన్నాయా ?

ఏసుక్రీస్తు యొక్క పుట్టినరోజును మనం పండగలా జరుపుకోవచ్చా?

మొదటి ప్రశ్న క్రైస్తవేతరుల నుండి తరచూ మనం వింటూ ఉంటాము.
ఈ ప్రశ్నల గురించి క్రైస్తవుల లో కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.

క్రైస్తవులు ఈ విషయం లో కంగారుపడవలసిన అవసరం లేదు, మనం మనదేవుడి గురించి ఏదీ  గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు,మన దేవుడు గురించి చారిత్రక ఆధారాలు ఉన్నాయి.    మనదేవుడు నిజ దేవుడు, ఉన్నవాడు.

క్రీ.పూ 31 నుండి  క్రీ.శ 14 వరకు కైసరు అగస్టీస్ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.ప్రస్తుతం ఇది ఇటలీ రాజధాని.నూతన నిబంధన కాలంలో మధ్యధరా సముద్రానికి చుట్టుప్రక్కల ఉన్న దేశాలన్నిటినీ రోమీయులు జయించారు,వారి అధికారం చివరికి ఫ్రాన్స్ ,ఇంగ్లాండ్ ల వరకు వ్యాపించింది,ఈవిధంగా వారి సామ్రాజ్యం యూరప్ ,ఉత్తర ఆఫ్రికా ,మధ్య ప్రాచ్య దేశాల్లో వ్యాప్తి చెందింది.
రోమనులు జయించిన దేశాలలో ఇశ్రాయేలు ,సిరియా లు కూడా ఉన్నాయి.

కైసర్ అగష్టిస్ తాను జయించిన దేశాల పరిపాలనను పునర్విభజన చేసి ,ఆ ప్రాంతాల లో సరిక్రొత్త జనాభా లెక్కలను తీసుకోమని ఆజ్ఞ ఇచ్చాడు.
ఆ సమయం లో కురేనియు సిరియా కు అధిపతి గా ఉన్నాడు,ఆ కాలం లో ఇశ్రాయేలు,దాని రాజధాని యెరుషలేము సిరియా లో భాగము గా ఉన్నది.

దావీదు బెత్లేహేములో పుట్టాడు కనుక ,దావీదు వంశీయులు అందరూ అక్కడే జనసంఖ్య లో లెక్కించబడాలి.కావున నజరేతు లో ఉన్న యోసేపు గర్భవతి గా ఉన్న మరియను తీసుకొని బేత్లేహేము వచ్చి అక్కడ జనసంఖ్య లో వారి పేర్లు నమోదు చేసుకున్నారు,
అప్పుడు బేత్లేహేము లోనే మరియు ఏసుక్రీస్తు కు జన్మనిస్తుంది. మెస్సయ్య బేత్లేహేము లోనే జన్మిస్తాడు అని మీకా 5:2లో చెప్పబడిన ప్రవచనం ఇక్కడ నెరవేరింది. ఇదంతా మనం పరిశుద్ధ గ్రంధం బైబిల్ లో చూస్తాము.

అయితే ఇదంతా నిజమేనా ?ఇది మనం నమ్మవచ్చా ? చూద్దాం.

1820 లో జెర్మన్ ఆర్కియాలజిస్ట్ russem ఆధ్వర్యంలో  కురేనియు యొక్క  పేలెస్ ను త్రవ్వుతున్నప్పుడు పైపరస్ బండిల్స్ దొరికాయి.
పైపరస్ అనేది ఆరోజుల్లో వ్రాయటానికి ఉపయోగించే కాగితం వంటిది. 

ఆ బండిల్స్ లో కురేనియు కాలం లో వ్రాయబడిన జన సంఖ్య ఉంది.అందులో 42 లక్షల 33 వేల పేర్లు రికార్డ్ అయి ఉన్నాయి.
జర్మన్ మ్యూజియం లో ఈరోజున కూడా ఆ రికార్డ్స్ ఉన్న బండిల్స్ మనం చూడవచ్చు.
దీనిని బట్టి బైబిల్ కట్టుకథల పుస్తకం కాదు,నిజమైన దేవుని గ్రంధం అని నిరూపించబడింది.

యేసుక్రీస్తు డిసెంబర్ 25నే పుట్టాడా ?

క్రీ.శ 360 లో Dennis the little అనే పురావస్తు శాస్త్రవేత్త రోమన్ లైబ్రరీ నుండి యెరుషలేము దేవాలయం యొక్క temple records తీసి,ఆ రికార్డ్స్ లో ఉన్న ఏసుక్రీస్తు యొక్క సున్నతి దినముయొక్క date ను గుర్తించాడు.సున్నతి జరిగిన ఎనిమిది రోజులు ముందుకు లెక్కించి
వారి కేలండర్ నుండి మనం వాడే కేలండర్ లోకి మార్చి caliculate చేసి డిసెంబర్ 25 న ఏసుక్రీస్తు పుట్టినరోజు అని నిర్ధారణ చేశారు.

ఆ కాలంలో  యూదులు  పుట్టిన పిల్లవాడికి సున్నతి చేసి ,పేరు పెట్టేటప్పుడు ఆ పిల్లవాడి యొక్క ditailsను  temple రికార్డ్స్ లో నోట్ చేసేవాళ్లు.అలాగే ఏసుక్రీస్తు కు కూడా సున్నతి చేసినట్లు గా బైబిల్ లో ఉంది.
ఆ రికార్డ్స్ ఇప్పుడు కూడా రోమన్ లైబ్రరీ లో మనం చూడవచ్చు.

కనుక డిసెంబర్ 25న ఏసుక్రీస్తు పుట్టాడు అని ఏదో ఊహించి చెప్పింది కాదు.దీనికి పక్కా evidens ఉన్నాయి.

ఏసుక్రీస్తు జన్మదినం ను మనం పండగలా జరుపుకోవచ్చా ?

ఇది మన క్రైస్తవుల లో కొంతమంది ప్రశ్న.
అపోస్తలులు ఎవరూ అలా చేయలేదు కదా మనం ఎందుకు చేయాలి అంటారు.

అపోస్తలులు సువార్త ను ప్రకటిస్తుఉంటేనే బ్రతకనీయలేదు,ఇంక పండగలు చేసుకోనిస్తారా?
 మొదటి శతాబ్దం లో 19 మంది రోమన్ చక్రవర్తులు 250 సంవత్సరాలు క్రైస్తవులను నరికి నరికి చంపారు.పండగలు ఎలా చేసుకోనిస్తారు?

అపోస్తులులు మనకు ఒక బేస్ ఇచ్చి వెళ్ళారు.
దేవుని విషయం లో మనం చేసేపనులు దేవుని మహిమ పరిచేవి గా ఉండాలి కానీ,సాతానుకు చోటు ఇవ్వకూడదు.
క్రిస్మస్ రోజు మనం దేవుని గురించే ఎక్కువగా ధ్యానిస్తాము,ఘనపరుస్తాము,మహిమ పరుస్తాము.
మహోన్నత   స్థలములో ఉండే దేవుడు ,మనకోసం భూమిమీద కు వచ్చి, అనేక శ్రమలు అనుభవించి ,మనకోసం ప్రాణం పెట్టిన యేసయ్య భూమి మీద జన్మించిన రోజును  మనము పండగలా జరుపుకోవడం తప్పు ఎలా అవుతుంది.

ఆయన తనను ఘనపరచటాన్ని ఎప్పుడూ కాదనలేదు,ఆయన పట్ల మనం అతిశయ పడటాన్ని ఆయన కాదనడు.

ఏసుక్రీస్తు యెరుషలేము లోకి ప్రవేశించేటప్పుడు అక్కడి జనం కొంతమంది ఏసుక్రీస్తును ఘనపరుస్తూ ఉంటారు.
అది చూస్తున్న అక్కడి శాస్త్రులు,పరిసయ్యులు కొంతమంది ఓర్చుకోలేక  ఆ ప్రజలయొక్క ఆనందాన్ని ,వారి ఉత్సాహాన్ని ఆపమని ఏసుక్రీస్తు తో చెబుతారు.
అప్పుడు ఏసుక్రీస్తు చక్కని మాట చెబుతాడు.

Luke(లూకా సువార్త) 19:39,40

1.ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులుబోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా
2.ఆయన వారిని చూచివీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననెను.

అంటే దేవునిపట్ల మనం పండగ జరుపుకుంటు,ఉత్సాహం గా ,ఆనందం గా ఉండటం ఆయనకు ఇష్టమే.
ఆయన  యందు మనం అతిశయపడటము  తప్పుకాదు.

ఈ పండుగ ను లోకస్తుల వలే  కేవలం   క్రొత్త బట్టలకు,పిండి వంటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆరోజు అంతాకూడా దేవునిని ధ్యానించటానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి ఒక్కరికీ నా మనవి.

ఈ పోస్టు  నా క్రైస్తవ సమాజానికి christmas సందర్భం గా నేను ఇస్తున్న చిన్ని గిఫ్ట్.

చింత లేదిక ఏసుపుట్టెను వింతగను బెత్లేహమందునా...
చెంత చేరగా రండి సర్వ జనాంగమా...
సంతసమొందుమా...

Friday, 14 April 2017

THE SEVEN WORDS OF JESUS ON THE CROSs. 1st word

THE SEVEN WORDS OF JESUS ON THE CROSS





Christ Jesus died on the Cross to redeem mankind, to save us from our sins because of his love for us. As recorded in the Gospels of Matthew, Mark, Luke, and John in the Holy Bible, Jesus Christ was mocked, scorned, and tortured in the praetorium. He carried his cross up the Via Dolorosa in Jerusalem to Calvary, was nailed to the Cross, and hung between two common criminals. He suffered an indescribable end, recalled by the Church on Good Friday of Holy Week.

One may meditate on the Passion of Christ by reflecting on his Seven Words on the Cross or by a devotion known as The Way of the Cross.

When religious pilgrimages to the Holy Land ended with military occupation of Jerusalem in the Middle Ages, a popular devotion known as The Way of the Cross arose during Lent retracing the Passion, Crucifixion, and Death of Jesus. The fourteen Stations of the Cross are (1) Pilate condemns Jesus to death; (2) Jesus takes up his Cross; (3) He falls the first time; (4) Jesus meets his sorrowful mother Mary; (5) Simon helps carry the cross; (6) Veronica cleans his face; (7) He falls the second time; (8) Jesus consoles the women of Jerusalem; (9) He falls the third time; (10) Jesus is stripped of his garments; (11) Jesus is nailed to the cross; (12) Jesus Christ dies on the cross; (13) Our Lord is taken down from the cross; (14) Christ is laid in the tomb.

Here are his Seven Words, the last seven expressions of Jesus Christ on the Cross recorded in Scripture.


THE FIRST WORD

"Father, forgive them, for they do not know what they do."
Gospel of Luke 23:34
Jesus of Nazareth is looking down from the cross just after he was crucified between two criminals. He sees the soldiers who have mocked, scourged, and tortured him, and who have just nailed him to the cross. He probably remembers those who have sentenced him - Caiaphas and the high priests of the Sanhedrin. Pilate realized it was out of envy that they handed him over (Matthew 27:18, Mark 15:10). But is Jesus not also thinking of his Apostles and companions who have deserted him, to Peter who has denied him three times, to the fickle crowd, who only days before praised him on his entrance to Jerusalem, and then days later chose him over Barabbas to be crucified?

Is he also thinking of us, who daily forget him in our lives?

Does he react angrily? No! At the height of his physical suffering, his love prevails and He asks His Father to forgive! Could there ever be greater irony? Jesus asks his Father to forgive, but it is by His very Sacrifice on the Cross that mankind is able to be forgiven!

Right up to his final hours on earth, Jesus preaches forgiveness. He teaches forgiveness in the Lord's prayer: "Forgive us our trespasses, as we forgive those who trespass against us" (Matthew 6:12). When asked by Peter, how many times should we forgive someone, Jesus answers seventy times seven (Matthew 18:21-22). At the Last Supper, Jesus explains his crucifixion to his Apostles when he tells them to drink of the cup: "Drink of it, all of you; for this is my blood of the covenant, which is poured out for many for the forgiveness of sins" (Matthew 26:27-28). He forgives the paralytic at Capernaum (Mark 2:5), and the adulteress caught in the act and about to be stoned (John 8:1-11). And even following his Resurrection, his first act is to commission his disciples to forgive: "Receive the Holy Spirit. If you forgive the sins of any, they are forgiven; if you retain the sins of any, they are retained" (John 20:22-23

Friday, 7 April 2017

యౌవ్వనుడా!* *ఎంజాయ్ యువర్ లైఫ్!*

🙏🏻దయచేసి 👇🏻ఇదేంటో చదవండి.....ప్లీజ్

*యౌవ్వనుడా!*
*ఎంజాయ్ యువర్ లైఫ్!*

ఎంజాయ్ అంటే?
బీర్లతో బార్లలో గడపడం.
బాయ్ ఫ్రెండ్స్ తో , గాళ్ ఫ్రెండ్స్ తో తిరగడం. చాటింగ్, డేటింగ్,
బైక్స్ మీద చక్కర్లు కొట్టడం, సినిమాలు, షికార్లు, సిగరెట్లు, ఖైనీలు, గూట్ఖాలు.... ఇట్లా ఎన్నెన్నో.

అవును! యవ్వనం తిరిగిరాదు కదా? నీ యవ్వనంలో నీకు నచ్చినట్లుగా ఎంజాయ్ చెయ్. నీకున్న కోరికలన్నీ తీర్చుకో. ఏది కావాలంటే అదిచూడు. నీ కన్నులు నీ ఇష్టం. కన్నులు చూడడానికే కదా?

అయితే? ఒక్క విషయం మాత్రం మరచిపోవద్దు.
*నీవు ఏదయితే చేసావో? అది మంచిదైనాసరే! చెడ్డదైనా సరే! తీర్పు నుండి మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ తప్పించుకోలేవు.*

*యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;*
*ప్రసంగి 11:9*

ఇంతకీ, ఎటువైపు నీ చూపులు?
ఏంటి నీ కోరికలు?

అమ్నోను చూపులు చెల్లెలు మీదకు మళ్ళాయట. చింతాక్రాంతుడై తన కోరిక చేత చిక్కిపోతున్నాడట.
2 సమూ 13:2
చివరకి తాను కోరుకున్నట్లే చేసాడు. ఫలితం? ప్రాణం కోల్పోయాడు.

చిన్న కుమారుని చూపులు రంగుల ప్రపంచం మీదకు మళ్ళాయట.
ఏమయ్యింది?
ఫలితం? పందులపొట్టే ఆహారం.
లూకా 15:16

దేవునిచేత ఏర్పరచబడిన సంసోను చూపులు వేశ్య మీదకు మళ్ళాయట. (న్యాయాధి 16:1)
ఏమయ్యింది?
సింహాన్ని సహితం చీల్చి వేసినవాడు, పచ్చి గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపినవాడు, మూడు వందల నక్కలను పట్టుకొని శత్రువుల పొలాలను నాశనం చేసినవాడు,
ఇప్పుడు, ఏ కళ్ళు అయితే ఆ వేశ్యను చూసాయో? ఆ రెండు కళ్ళూ పెరికి వేయబడ్డాయి. దాగోను దేవతకు బలి పశువుగా నిలబడ్డాడు.

దీనా చూపులు లోకం మీదకు మళ్ళాయట. దీనా ఆదేశ కుమార్తెలను చూడాలనుకుంది.
ఆది 34:1
ఏమయ్యింది?
ఆ దేశ రాజకుమారుడు ఆమెను చూసాడు, పాడుచేసాడు. తద్వారా దీనా అన్నలు హంతకులుగా మార వలసివచ్చింది.

ఒక్కసారి ఆలోచించు!!
వీళ్ళంతా లోకాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళే. కాని వారిఅంతం ఎట్లా వుంది? *నీ జీవితం సంతోషంగా, సాఫీగానే సాగిపోతుందిలే అనుకొంటున్నావా? కాని, దాని అంతం మాత్రం ఘోరంగా వుంటుంది. ఆ దినాన్న మాత్రం తప్పించుకోలేవు. అల్పకాల సుఖ భోగాలను చూసుకొని నిత్య రాజ్యాన్ని కాళ్ళతో తన్నేస్తావా?*

యోసేపు పవిత్రమైన జీవితాన్ని జీవించ గలిగాడు. ఇస్సాకు దేవుని కోసం అర్పణగా మారడానికి సిద్ధపడ్డాడు. యోప్తా కుమార్తె దేవునికోసం అర్పణగా మార్చబడింది.
వారి జీవితాలు ధన్యమయ్యాయి.

చివరిగా ఒక్క మాట!
*ఆనందం ఎక్కడ వుందో తెలుసా?*
*అది యేసయ్యలోనే.*
*యేసయ్యలో ఆనందం*
సమాధానకరమైనది.*
అది శాశ్వతమైనది.*

యౌవనుడా!
ఎంజాయ్ చెయ్ యేసయ్యతోనే!!

🙏🏻మీకు నచ్చితే కనీసం ఒక 10మందికి పంపి....మాతోపాటు దేవుని రాజ్యవ్యాప్తిలో భాగస్వాములు అవ్వండి.....🙌🏻నా దేవుడు నిన్ను బలపరచును గాక....ఆమేన్
***********************
✍🏻..ప్రభు సేవలో మీ సహోదరుడు.

Tuesday, 28 March 2017

సంఘము అంటే ఏమిటి

ప్రశ్న: సంఘము అంటే ఏమిటి?

జవాబు: నేడు అనేక మంది ప్రజలు సంఘము అంటే భవనము అని ఆలోచిస్తారు. అయితే ఇది సంఘమును గూర్చిన బైబిల్ అవగాహన కాదు. “సంఘము” అనే పదము గ్రీకు పదమైన ekklesia నుండి వస్తుంది, మరియు “సభ” లేక “బయటకు-పిలువబడినవారు” అని దీని అర్థము. “సంఘము” యొక్క ములార్థము భవనము కాదు, ప్రజలు. మీరు ఏ సంఘమునకు వెళ్తున్నారు అని ప్రజలను అడిగినప్పుడు ప్రజలు సాధారణంగా భవనం పేరు చెప్పుట వ్యంగ్యము. “…వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి” అని రోమా 16:5 చెబుతుంది. వారి గృహములో ఉన్న సంఘమును పౌలు సంబోధిస్తున్నాడు గాని, సంఘ భవనమును కాదు, విశ్వాసుల శరీరమును.

సంఘము క్రీస్తు శరీరమైయుంది, మరియు ఆయన దాని శిరస్సు. “మరియు సమస్త మును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపు చున్న వాని సంపూర్ణతయై యున్నది” అని ఎఫెసీ. 1:22-23 చెబుతుంది. క్రీస్తు శరీరములో పెంతెకొస్తు దినము (అపొ. 2 వ అధ్యాయం) మొదలు క్రీస్తు రాక వరకు యేసు క్రీస్తు నందలి విశ్వాసులందరు భాగమైయుంటారు. క్రీస్తు శరీరములో రెండు విషయములు ఉన్నాయి:

1) సార్వత్రిక సంఘములో యేసు క్రీస్తుతో వ్యక్తిగత అనుబంధము కలిగియున్న వారందరు ఉంటారు. “ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు” (1 కొరింథీ. 12:13). నమ్మిన ప్రతివాడు క్రీస్తు శరీరములో భాగమని మరియు దానికి రుజువుగా క్రీస్తు ఆత్మను పొందుకున్నాడని ఈ వచనం చెబుతుంది. యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా రక్షణను పొందుకున్న వారందరు దేవుని యొక్క సార్వత్రిక సంఘము.

2) గలతీ. 1:1-2లో స్థానిక సంఘము వివరించబడింది: “...అపొస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును, నాతో కూడనున్న సహోదరులందరును, గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది.” గలతీ ప్రాంతములో అనేక సంఘములు ఉన్నాయని ఇక్కడ మనం చూస్తాము-వీటిని స్థానిక సంఘములు అంటాము. బాప్టిస్టు సంఘము, లూథరన్ సంఘము, కాథలిక్ సంఘము, మొ., సార్వత్రిక సంఘములోని సంఘము కాదు, కాని అవి స్థానిక విశ్వాసుల శరీరము కలిగిన స్థానిక సంఘము. సార్వత్రిక సంఘములో క్రీస్తుకు చెందినవారు మరియు రక్షణ కొరకు అయనను నమ్మినవారు ఉంటారు. సార్వత్రిక సంఘములోని ఈ సభ్యులు స్థానిక సంఘములో సహవాసము మరియు క్షేమాభివ్రుద్ధి కొరకు వెదకాలి.

సారాంశంగా, సంఘము ఒక భవనము లేక డినామినేషన్ కాదు. బైబిల్ ప్రకారం, సంఘము క్రీస్తు శరీరము-రక్షణ కొరకు యేసు క్రీస్తుపై విశ్వాసముంచిన ప్రజలు (యోహాను 3:16; 1 కొరింథీ. 12:13). స్థానిక సంఘములు సార్వత్రిక సంఘములోని సభ్యుల యొక్క కూడిక. స్థానిక సంఘములో సార్వత్రిక సంఘములోని సభ్యులు 1 కొరింథీ. 12వ అధ్యాయములోని “శరీర” నియమాలను అన్వయించవచ్చు” ప్రోత్సహించుట, బోధించుట, ప్రభువైన యేసు క్రీస్తు కృపలో ఒకరినొకరు కట్టుకొనుట.

క్రొత్తగా జన్మించిన క్రైస్తవునిగా ఉండుట అనగా ఏమిటి?

క్రొత్తగా జన్మించిన క్రైస్తవునిగా ఉండుట అనగా ఏమిటి?

జవాబు: క్రొత్తగా జన్మించిన క్రైస్తవునిగా ఉండుట అనగా అర్థం ఏమిటి? బైబిల్ లో ఈ ప్రశ్నకు జవాబిచ్చు ఉత్తమమైన వాక్యము యోహాను 3:1-21. ప్రముఖ పరిసయ్యుడును యూదుల సన్హెద్రెనులో (యూదుల అధికారుల సభ) సభ్యుడునునైన నీకొదేముతో ప్రభువైన యేసు క్రీస్తు మాట్లాడుచుండెను. నీకొదేము కొన్ని ప్రశ్నలతో రాత్రి వేళ యేసు యొద్దకు వచ్చెను.

యేసు నీకొదేముతో మాట్లాడుతూ, ఇలా అనెను, “‘ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.’ అందుకు నీకొదేము, ‘ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు?’ అని అడిగెను. ‘రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగెను!’ అందుకు యేసు ఇట్లనెను, ‘ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు’” (యోహాను 3:3-7).

“క్రొత్తగా జన్మించుట” అను మాట యొక్క అక్షరార్థము “పైనుండి జన్మించుట.” నీకొదేముకు ఒక నిజమైన అవసరత ఉండెను. అతనికి హృదయ పరివర్తన-ఆత్మీయ మార్పు అవసరము. క్రొత్త జీవితం, తిరిగి జన్మించుట, అనునది దేవుని కార్యము మరియు విశ్వసించు వ్యక్తికి నిత్య జీవము ఇవ్వబడుతుంది (2 కొరింథీ. 5:17; తీతు. 3:5; 1 పేతురు 1:3; 1 యోహాను 2:29; 3:9; 4:7; 5:1-4, 18). “క్రొత్తగా జన్మించుట” అనగా యేసు క్రీస్తు నామమును నమ్ముట ద్వారా “దేవుని పిల్లలగుట” అను తలంపు కూడ వస్తుందని యోహాను 1:12, 13 సూచిస్తుంది.

“ఒక వ్యక్తి నూతనంగా ఎందుకు జన్మించాలి?” అనునది సాధారణంగా తలెత్తు ప్రశ్న. “మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను” అని ఎఫెసీ. 2:1లో అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” (రోమా. 3:23) అని ఆయన రోమీయులకు వ్రాసెను. పాపులు ఆత్మీయంగా “మరణించియున్నారు”; క్రీస్తు నందు విశ్వాసము ద్వారా వారు ఆత్మీయ జీవితమును పొందినప్పుడు, దానిని బైబిల్ నూతన జన్మతో పోలుస్తుంది. కేవలం నూతనంగా జన్మించినవారు మాత్రమే పాప క్షమాపణ పొంది దేవునితో అనుబంధం కలిగియుందురు.

ఇది ఎలా సాధ్యము? “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు” అని ఎఫెసీ. 2:8-9 చెబుతుంది. ఒకరు రక్షింపబడినప్పుడు, అతడు/ఆమె క్రొత్తగా జన్మించి, ఆత్మీయంగా నూతనపరచబడి, క్రొత్త జన్మ హక్కు ద్వారా దేవుని బిడ్డ అవుతారు. సిలువపై మరణించుట ద్వారా పాపము యొక్క జీతమును చెల్లించిన యేసు క్రీస్తును నమ్ముట, “నూతనంగా జన్మించుటకు” మార్గము. “కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను!” (2 కొరింథీ. 5:17).

మీరు ఇప్పటి వరకు ప్రభువైన యేసు క్రీస్తును రక్షకునిగా విశ్వసించని యెడల, పరిశుద్ధాత్ముడు మీ హృదయములతో మాట్లాడుచుండగా ఆయన పిలుపును మీరు అంగీకరిస్తారా? మీరు పశ్చాత్తాప ప్రార్థన చేసి నేడు క్రీస్తులో నూతన సృష్టి కాగలరా? “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలనైనను శరీరేచ్చవలనైనను మానుషేచ్చవలననైనను పుట్టినవారు కారు" (యోహాను 1:12-13).

మీరు యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి క్రొత్తగా జన్మించాలని కోరితే, ఇలా ప్రార్థన చేయవచ్చు. ఈ ప్రార్థన చెప్పుట లేక వేరే ఏ ప్రార్థన చెప్పుట కూడ మిమ్మును రక్షించదని జ్ఞాపకముంచుకోండి. కేవలం క్రీస్తును నమ్ముట మాత్రమే మిమ్మును పాపము నుండి రక్షించగలదు. ఈ ప్రార్థన కేవలం దేవునిలో మీకున్న విశ్వాసమును తెలియజేయుటకు మరియు మీకు రక్షణ ఇచ్చినందుకు ఆయనకు వందనములు చెల్లించుటకు ఒక మార్గము మాత్రమే. “దేవా, నేను నీకు విరోధముగా పాపము చేసితిని మరియు శిక్షకు పాత్రుడనని నాకు తెలుసు. అయితే నేను పొందవలసిన శిక్షను యేసు క్రీస్తు తీసుకొనెను మరియు ఆయనను విశ్వసించుట ద్వారా నేను క్షమాపణ పొందగలను. రక్షణ కొరకు నా విశ్వాసమును నీ మీద మోపుచున్నాను. నీ అద్భుత కృప కొరకు క్షమాపణ కొరకు-నిత్య జీవమను బహుమానము కొరకు వందనములు! ఆమేన్!” 

నాలుగు ఆత్మీయ నియమాలు ఏవి

ప్రశ్న: నాలుగు ఆత్మీయ నియమాలు ఏవి?

జవాబు: నాలుగు ఆత్మీయ నియమాలు యేసు క్రీస్తు నందు విశ్వాసము ద్వారా కలుగు రక్షణ యొక్క శుభవార్తను ఇతరులకు పంచు మార్గములు. సువార్తలోని ముఖ్య సందేశమును నాలుగు బిందువులలో సమకూర్చు సులువైన మార్గమిది.

నాలుగు ఆత్మీయ నియమాలలో మొదటిది, “దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, మరియు నీ జీవితం కొరకు గొప్ప ప్రణాళిక కలిగియున్నాడు.” “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని యోహాను 3:16 చెబుతుంది. “గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని” అని యేసు రాక యొక్క కారణమును యోహాను 10:10 ఇస్తుంది. దేవుని ప్రేమ నుండి మనలను ఏమి ఆపుతుంది? సమృద్ధి జీవితము కలగకుండా మనలను ఏమి ఆపుతుంది?

నాలుగు ఆత్మీయ నియమాలలో రెండవది, “మానవ జాతి పాపముతో మలినమై దేవునికి దూరమాయెను. అందువలన, మన జీవితాలలో దేవుని యొక్క అద్భుత ప్రణాళికను మనం తెలుసుకోలేము.” “అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అని రోమా. 3:23 ఈ విషయమును నిశ్చయిస్తుంది. “పాపము వలన వచ్చు జీతము మరణము” అని రోమా. 6:23 పాపము యొక్క పరిణామమును తెలియజేస్తుంది. తనతో సహవాసం కలిగియుండుటకు దేవుడు మనలను సృష్టించెను. అయితే, మానవులు లోకములోనికి పాపము తెచ్చి, దేవుని నుండి వేరుచేయబడెను. మనతో దేవుడు కలిగియుండాలని ఆశించిన అనుబంధమును మనం నాశనం చేశాము. పరిష్కారం ఏమిటి?

నాలుగు ఆత్మీయ నియమాలలో మూడవది, “మన పాపం కొరకు యేసు క్రీస్తు మాత్రమే దేవుడిచ్చిన పరిష్కారం. యేసు క్రీస్తు ద్వారా, మన పాపములు క్షమించబడి దేవునితో సరైన అనుబంధం పునరుద్ధరించవచ్చు.” “అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమైయుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను,” అని రోమా. 5:8 చెబుతుంది. “...లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను,” అని రక్షణ పొందుటకు మనం తెలుసుకొనవలసిన, విశ్వసించవలసిన విషయములను గూర్చి 1 కొరింథీ. 15:3-4 చెబుతుంది. ఆయన మాత్రమే రక్షణ మార్గమని యోహాను 14:6లో యేసు ప్రకటించుచున్నాడు, “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.” ఈ గొప్ప రక్షణ బహుమానమును నేను ఎలా పొందగలను?

నాలుగు ఆత్మీయ నియమాలలో నాల్గవది, “రక్షణ బహుమానమును పొందుటకు మరియు మన జీవితాలలో దేవుని అద్భుత ప్రణాళికను తెలుసుకొనుటకు యేసు క్రీస్తు రక్షకుడని విశ్వసించాలి.” “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను” అని యోహాను 1:12 దీనిని మన కొరకు వివరించుచున్నది. “ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నే యింటివారును రక్షణ పొందుదురు” అని అపొ. 16:31 ఈ విషయమును స్పష్టముగా చెబుతుంది. మనం కేవలం కృప వలనే, విశ్వాసం ద్వారానే, యేసు క్రీస్తులోనే రక్షించబడగలము (ఎఫెసీ. 2:8-9).

మీ రక్షకునిగా యేసు క్రీస్తు పైన నమ్మిక ఉంచాలని మీరు కోరితే, దేవునితో ఈ మాటలు చెప్పండి. ఈ మాటలు చెప్పుట మిమ్మును రక్షించదు, క్రీస్తును నమ్ముట రక్షించగలదు! ఈ ప్రార్థన కేవలం దేవునిలో మీకున్న విశ్వాసమును తెలియజేయుటకు మరియు మీకు రక్షణ ఇచ్చినందుకు ఆయనకు వందనములు చెల్లించుటకు ఒక మార్గము మాత్రమే. “దేవా, నేను నీకు విరోధముగా పాపము చేసితిని మరియు శిక్షకు పాత్రుడనని నాకు తెలుసు. అయితే నేను పొందవలసిన శిక్షను యేసు క్రీస్తు తీసుకొనెను మరియు ఆయనను విశ్వసించుట ద్వారా నేను క్షమాపణ పొందగలను. రక్షణ కొరకు నా విశ్వాసమును నీ మీద మోపుచున్నాను. నీ అద్భుత కృప కొరకు క్షమాపణ కొరకు-నిత్య జీవమను బహుమానము కొరకు వందనములు! ఆమేన్!”

ప్రశ్న: దైవఘటన సిద్ధాంత వేదాంతము అనగానేమి

ప్రశ్న: దైవఘటన సిద్ధాంత వేదాంతము అనగానేమి, మరియు అది పరిశుద్ధగ్రంథానుసారమైనదేనా
జవాబు: దైవఘటన అనునది కార్యములను చక్కబెట్టునటువంటి ఒక విధానము – ఒక పరిపాలన, ఒక విధానము, ఒక నిర్వహణ. వేదాంత శాస్త్రములో, ఈవిధి/దైవఘటన అనునది ఒక కాలమును గూర్చిన దైవిక పరిపాలనా విధానము; ప్రతి యుగము కూడా దైవ నిర్దేశిత యుగము. దైవఘటన సిద్ధాంత వేదాంతము అంటే ఈ యుగములు దేవునిచే ఉద్దేశించబడి లోకము యొక్క పరిస్థితులను క్రమబద్దీకరిస్తున్నాయి అని చెప్పే ఒక వేదాంతశాస్త్ర పరమైన వ్యవస్థ. ఈ దైవఘటన సిద్ధాంతములో ప్రాముఖ్యంగా రెండు ప్రత్యేకతలు ఉంటాయి: 1) లేఖనభాగముల స్థిరమైనవిశదము, ప్రత్యేకముగా పరిశుద్ధ గ్రంథ ప్రవచనము గూర్చి, మరియు 2) దేవుని ప్రణాళికలో సంఘము కంటే ఇశ్రాయేలు ఒక విశిష్టత కలిగిన వ్యవస్థ అని చెప్పే ఆలోచన. సంప్రదాయమైన దైవఘటన సిద్ధాంత వేదాంతము మానవాళిని గూర్చిన దేవుని ప్రణాళికలో కనీసం ఏడు దైవఘటనలు ఉన్నట్లుగా గుర్తిస్తుంది.

పరిశుద్ధగ్రంథమును ఉన్నది ఉన్నట్లుగా అక్షరాలా వివరించడమే శ్రేష్ట్టమైన విశదము అని ఈ దైవఘటన సిద్ధాంతము తెలుపుతుంది. ఈవిధమైన అక్షరార్థము ప్రతి పదమునకు దైనందిన ప్రయోగంలో ఉండే ఆ అర్థాన్నే సాధారణంగా ఇస్తుంది. గురుతులకు, భాషా రూపములకు, మరియు అనేక రకాలకు కొన్ని అనుమతులు ఉంటాయి అనుకోండి. ఆఖరుకు గురుతులు మరియు అలంకారములతో కూడిన మాటలకు కూడా వాటి వెనుక ఒక అక్షరార్థము ఏదో ఉంటుందని భావించబడుతుంది. ఉదాహరణకు, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథము “వెయ్యేళ్ళ”ను గూర్చి మాట్లాడుతున్నప్పుడు, దైవఘటన సిద్ధాంతులు ఈ అంకెను అక్షరాలా 1000 సంవత్సరాల కాలముగా వివరిస్తారు (అంటే రాజ్యము యొక్క యుగముగా), ఎందుకంటే దీనిని వేరేవిధంగా వివరించుటకు ఆమోదయోగ్యమైన కారణము ఏమియు లేదు గనుక.

లేఖనమును దృష్టించుటకు ఈ అక్షరార్థమే శ్రేష్టమైన విధానము అని చెప్పుటకు కనీసం రెండు కారణాలు ఉన్నాయి. మొదటిగా, తత్వశాస్త్ర అనుసారముగా, భాష యొక్క ఉద్దేశమే అసలు మనము పదములను అక్షరార్థముతో విశదీకరించాలని చెప్తుంది. సంభాషించుకొనుటకు వీలుగా భాష అనునది దేవునిచే దయచేయబడింది. పదములు అనునవి అర్థము యొక్క పాత్రలు. రెండవది పరిశుద్ధగ్రంథానుసారమైనది. పాతనిబంధనలో యేసుక్రీస్తును గూర్చి చేయబడిన ప్రతిఒక్క ప్రవచనము అక్షరార్థముగా నెరవేరబడింది. యేసు యొక్క పుట్టుక, పరిచర్య, మరణము మరియు పునరుద్ధానము ఇవన్నియు పాతనిబంధన ప్రవచించినట్లుగానే నెరవేరాయి. ప్రవచనములు అక్షరార్థములు. క్రొత్తనిబంధనలో మెస్సీయ నెరవేర్చిన ప్రవచనములలో అక్షరార్థ-రహిత నేరవేర్పులు ఏమి లేవు. ఇది అక్షరార్థమైన విధానము కొరకు బలమైన వాదన వినిపిస్తుంది. లేఖనములను చదుతువున్నప్పుడు అక్షరార్థమైన విశదము ప్రయోగించకపొతే, పరిశుద్ధ గ్రంథమును అర్థము చేసుకొనుటకు గలబాహ్యమైన ప్రామాణికం ఏమి లేదు. ప్రతి వ్యక్తి తనకు ఇష్టం వచ్చినట్లుగా లేఖనములను విశదపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథ విశదము అనునది “పరిశుద్ధ గ్రంథము ఈ విధముగా చెప్తుంది” అని అనుట నుండి “ఈ వాక్యభాగము నాకు ఏమి చెప్తుంది” అని చెప్పే అంత స్థితికి దిగజారుతుంది. చాలా వరకు పరిశుద్ధ గ్రంథ అధ్యయనము అని పిలువబడుతున్న వాటిలో నేడు జరుగుతుంది కూడా ఇదే కావడం విచారకరం.

దైవఘటన సిద్ధాంతమనే వేదాంతము రెండు వేరువేరు రకాలైన దేవుని ప్రజలు ఉన్నారని మనకు బోధిస్తుంది: ఇశ్రాయేలు మరియు సంఘము. ఈ సిద్ధాంత వాదులు రక్షణ అనునది ఎప్పుడైనా విశ్వాసము ద్వారానే – అంటే పాతనిబంధన దేవునిపై విశ్వాసము అలాగే ప్రత్యేకముగా క్రొత్తనిబంధనలో ఉన్న కుమారుడైన దేవుని యందు విశ్వాసము – కలుగుతందని నమ్ముతారు. దేవుని ప్రణాళికలో సంఘము అనునది ఇశ్రాయేలు యొక్క స్థానాన్ని ప్రతిక్షేపించలేదు మరియు పాతనిబంధనలో ఇశ్రాయేలును గూర్చి చేయబడిన వాగ్దానాలు సంఘమునకు బదిలీ చేయబడలేదు అని వీరు నమ్ముతారు. పాతనిబంధనలో దేవుడు ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానాలు (భూమిని గూర్చి, అనేకసంతానమును గూర్చి, మరియు ఆశీర్వాదములను గూర్చి) ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో మాట్లాడబడిన ఆ వెయ్యేళ్ళ పరిపాలన కాలములో నెరవేరతాయి అని ఈ దైవఘటన సిద్ధాంతము బోధిస్తుంది. ఈ యుగమందు ఏవిధంగానైతే దేవుడు తన దృష్టిని సంఘముపై నిలుపుతున్నాడో, భవిష్యత్తులో మరలా ఒకసారి దేవుడు తన దృష్టిని ఇశ్రాయేలుపై పెడతాడు అని ఈ సిద్ధాంతవాదులు నమ్ముతారు(రోమీయులకు 9-11 మరియు దానియేలు 9:24 చూడండి).

పరిశుద్ధ గ్రంథము ఏడు యుగములుగా నిర్వహించబడినది అనిదైవఘటన సిద్ధాంత వేదాంతులు భావిస్తుంటారు: అమాయక యుగము (ఆదికాండము 1:1 – 3:7), మనసాక్షి యుగము (ఆదికాండము 3:8 – 8:22), మానవ ప్రభుత్వ యుగము (ఆదికాండము 9:1 – 11:32), వాగ్ధాన యుగము (ఆదికాండము 12:1 – నిర్గమకాండము 19:25), ధర్మశాస్త్ర యుగము(నిర్గమకాండము 20:1 – అపొస్తలుల కార్యములు 2:4), కృపా యుగము (అపొస్తలుల కార్యములు 2:4 – ప్రకటన 20:3), మరియు వెయ్యేళ్ళ రాజ్యపరిపాలన యుగము (ప్రకటన 20:4-6). మరలా, ఈ యుగములు అనునవి రక్షణకు మార్గములు కావు, కాని దేవుడు మానవులతో అనుబంధం చేసుకొనే విధానాలు. ప్రతి యుగము కూడా ఆ యుగము

Monday, 27 March 2017

What is the sinner's prayer

ప్రశ్న: పాపి యొక్క ప్రార్థన ఏమిటి?

Question: What is the sinner's prayer?

Answer: The sinner's prayer is a man that is a sinner, he realized that he needed a Savior, and he / she pray to God. We did not achieve what the sinner's prayer. A true sinner's prayer, knowing that a man of his sinful nature and need of the Savior, to absorb, to tell the belief.

Understanding that we all are sinners in the first step of the sinner's prayer. "As vrayabadinademanaga is not fair, there is one," said Roma. 3:10 says. The Bible clearly says that we all sin cesitimani. We all need God's mercy and forgiveness, which accounts for the sinners (Titus. 3: 5-7). Because we are sinners, we are entitled to eternal punishment (Matthew 25:46). Sinner's prayer request for mercy instead of judgment. Reporting for compassion instead of anger.

The second step in the sinner's prayer, God, what did we get lost vimocincutaku us from the situation of sin. Manavudayenu personality of God, made flesh in Jesus Christ (John 1: 1, 14). Jesus taught us the truth about God and to live a full righteousness sinless life (John 8:46; 2 Cor. 5:21). We put him in punishment, Jesus died on the Cross in our place (Rom. 5: 8). Papumupai, death, and the death of Jesus from narakamupai nirupincutaku his success tirigilecenu (kolassi. 2:15; 1 Cor. 15th chapter). As a result, our sins can be forgiven and received the promise of heaven, an eternal house - uncinayedala our faith in Jesus Christ. He died in our place, we tirigilecenani ceyavalasinadanta believe (Rom. 10: 9-10). We only by the grace of faith, saying, receive the protection of Jesus Christ. "Grace you saved through faith; Mivalana can not do it, the gift of God, "the Ephesians. 2: 8 ghosistundi.

You trusting in Jesus as your own Savior and a simple way of conveying to the sinner's prayer. Get protection against any kind of "magic" no words. Only faith can save us from death and resurrection of Jesus. If you are a sinner and that you have need of salvation through Jesus Christ to be absorbed, the sinner's prayer, you can turn to God: "God, I know I am a sinner. I also know that I deserve the consequences of my sin. But, I believe that Jesus Christ is my savior. I believe that His death and resurrection pay for my forgiveness. Jesus is the only Lord and Savior of my own and I am Jesus. Praise the Lord, for saving me and ksamincinanduku! Amen! "

పాపి యొక్క ప్రార్థన ఏమిటి

ప్రశ్న: పాపి యొక్క ప్రార్థన ఏమిటి?
ప్రశ్న: పాపి యొక్క ప్రార్థన ఏమిటి?

జవాబు: పాపి యొక్క ప్రార్థన అనగా ఒక వ్యక్తి తాను పాపినని తనకు రక్షకుడు అవసరమని గ్రహించినప్పుడు అతడు/ఆమె దేవునికి చేయు ప్రార్థన. పాపి యొక్క ప్రార్థన చేయుట మాత్రమే ఏమి సాధించలేదు. ఒక నిజమైన పాపి ప్రార్థన ఒక వ్యక్తి తన పాపపు స్వభావమును మరియు రక్షకుని యొక్క అవసరతను యెరిగి, గ్రహించి, నమ్ముటను తెలియజేస్తుంది.

పాపి ప్రార్థన యొక్క మొదటి మెట్టు మనమంతా పాపులమని గ్రహించుట. “ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు,” అని రోమా. 3:10 చెబుతుంది. మనమంతా పాపము చేసితిమని బైబిల్ స్పష్టముగా చెబుతుంది. మనమంతా దేవుని యొక్క కరుణ మరియు క్షమాపణ యొక్క అవసరత కలిగియున్న పాపులము (తీతు. 3:5-7). మన పాపుము వలన మనం నిత్య శిక్షకు అర్హులం (మత్తయి 25:46). పాపి ప్రార్థన తీర్పుకు బదులుగా కృప కొరకు నివేదన. కోపమునకు బదులుగా కరుణ కొరకు నివేదన.

పాపి ప్రార్థనలో రెండవ మెట్టు, మన నశించిన పాపపు పరిస్థితి నుండి మనలను విమోచించుటకు దేవుడు ఏమి చేసెనో తెలుసుకొనుట. దేవుడు శరీరధారియై యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో మానవుడాయెను (యోహాను 1:1, 14). యేసు మనకు దేవునిని గూర్చిన సత్యమును బోధించి ఒక పూర్ణమైన నీతిగల పాపములేని జీవితమును జీవించెను (యోహాను 8:46; 2 కొరింథీ. 5:21). మనము పొందవలసిన శిక్షను తనపై వేసుకొని, మన స్థానంలో యేసు సిలువపై మరణించెను (రోమా. 5:8). పాపుముపై, మరణముపై, మరియు నరకముపై తన విజయమును నిరూపించుటకు యేసు మరణము నుండి తిరిగిలేచెను (కొలస్సి. 2:15; 1 కొరింథీ. 15వ అధ్యాయం). దీని వలన, మన పాపములు క్షమించబడి పరలోకమందు ఒక నిత్య గృహము యొక్క వాగ్దానమును పొందియున్నాము – యేసు క్రీస్తునందు మన విశ్వాసమును ఉంచినయెడల. మనం చేయవలసినదంతా ఆయన మన స్థానంలో మరణించి తిరిగిలేచెనని నమ్మటమే (రోమా. 10:9-10). మనం కేవలం కృప ద్వారానే, విశ్వాసం వలనే, యేసు క్రీస్తులోనే రక్షణ పొందగలం. “మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే,” అని ఎఫెసీ. 2:8 ఘోషిస్తుంది.

మీరు మీ సొంత రక్షకునిగా యేసును నమ్ముచున్నారని తెలియజేయుటకు పాపి యొక్క ప్రార్థన చేయుట ఒక సులువైన మార్గము. రక్షణ పొందుటకు ఎలాంటి “మ్యాజిక్” మాటలు లేవు. కేవలం యేసు యొక్క మరణం మరియు పునరుత్ధానంపై విశ్వాసం మాత్రమే మనలను రక్షించగలదు. మీరు పాపి అని మరియు యేసు క్రీస్తు ద్వారా రక్షణ యొక్క అవసరత మీకు ఉందని గ్రహించిన యెడల, ఈ పాపి యొక్క ప్రార్థన మీరు దేవునికి చెయ్యవచ్చు: “దేవా, నేను పాపినని నాకు తెలుసు. నా పాపము యొక్క పరిణామాలకు నేను పాత్రుడనని కూడ నాకు తెలుసు. కాని, నా రక్షకునిగా యేసు క్రీస్తును నేను నమ్ముచున్నాను. ఆయన మరణం మరియు పునరుత్ధానం నా క్షమాపణకు వెల చెల్లించెను అని నమ్ముచున్నాను. నా సొంత ప్రభువు మరియు రక్షకునిగా నేను యేసును మరియు యేసును మాత్రమే నమ్ముచున్నాను. వందనాలు ప్రభువా, నన్ను రక్షించినందుకు మరియు క్షమించినందుకు! ఆమేన్!”

Monday, 20 March 2017

ప్రశ్న: దేవదూతలను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది

ప్రశ్న: దేవదూతలను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?

జవాబు: దేవదూతలు జ్ఞానం, భావోద్వేగాలు, మరియు చిత్తము కలిగియున్న వ్యక్తిగత ఆత్మీయ జీవులు. మంచి మరియు చెడ్డ దూతలు (దయ్యములు) ఇలానే ఉంటాయి. దేవదూతలు జ్ఞానము కలిగినవి (మత్తయి 8:29; 2 కొరింథీ. 11:3; 1 పేతురు 1:12), భావోద్వేగము చూపునవి (లూకా 2:13; యాకోబు 2:19; ప్రకటన 12:17), మరియు చిత్తమును ఉపయోగించునవి (లూకా 8:28-31; 2 తిమోతి 2:26; యూదా 6). దేవదూతలు నిజమైన శారీరములు లేని ఆత్మీయ జీవులు (హెబ్రీ. 1:14). వాటికి శరీరములు లేనప్పటికీ, అవి కూడా వ్యక్తిత్వాలే. 

అవి సృష్టించబడిన జీవులు కాబట్టి, వాటి జ్ఞానం పరిమితమైనది. అనగా దేవునికి తెలిసినట్లు అన్ని విషయములు వాటికి తెలియవు (మత్తయి 24:36). అయితే, వాటికి మానవుల కంటే ఎక్కువ జ్ఞానం ఉండవచ్చు, మరియు అది మూడు కారణముల వలన కావచ్చు. మొదటిగా, దేవదూతలు మానవుల కంటే గొప్ప జీవులుగా సృష్టించబడినాయి. కాబట్టి, అవి ఎక్కువ జ్ఞానము కలిగియున్నాయి. రెండవదిగా, మానవుల కంటే ఎక్కువ సంపూర్ణంగా దేవదూతలు బైబిల్ ను మరియు లోకమును చదవగలవు మరియు దాని నుండి జ్ఞానమును సంపాదించగలవు (యాకోబు 2:19; ప్రకటన 12:12). మూడవదిగా, మానవ క్రియలను సుదీర్ఘముగా పరిశీలించుట ద్వారా దేవదూతలు జ్ఞానమును పొందగలవు. మానవుల వలె దేవదూతలకు భూతకాలమును చదవవలసిన పని లేదు; అవి దానిని అనుభవించాయి. కాబట్టి, ఇతరులు పలు పరిస్థితులలో ఎలా స్పందించారు మరియు వారి ప్రతి క్రియలు ఎలా ఉన్నాయో వాటికి తెలుసు మరియు మనం అట్టి పరిస్థితులలో ఎలా స్పందిస్తామో అవి ఖచ్చితముగా ప్రవచించగలవు. 

దేవదూతలకు ఇతర ప్రాణుల వలె సొంత చిత్తములు ఉన్నప్పటికీ, అవి దేవుని చిత్తమునకు పాత్రులుగా ఉన్నాయి. విశ్వాసులకు సహాయం చేయుటకు మంచి దూతలు దేవునిచే పంపబడినవి (హెబ్రీ. 1:14). బైబిల్ లో సూచించబడిన దేవదూతలు చేయు పనులు:

అవి దేవుని స్తుతిస్తాయి (కీర్తనలు 148:1-2; యెషయా 6:3). అవి దేవుని ఆరాధిస్తాయి (హెబ్రీ. 1:6; ప్రకటన 5:8-13). దేవుడు చేయు పనులలో అవి ఆనందిస్తాయి (యోబు 38:6-7). అవి దేవుని సేవిస్తాయి (కీర్తనలు 103:20; ప్రకటన 22:9). అవి దేవుని ఎదుట ప్రత్యక్షమవుతాయి (యోబు 1:6; 2:1). అవి దేవుని తీర్పుకు సాధనములు (ప్రకటన 7:1; 8:2). అవి ప్రార్థనలకు జవాబులు ఇస్తాయి (అపొ. 12:5-10). క్రీస్తు కొరకు ప్రజలను గెలచుటలో అవి సహాయపడతాయి (అపొ. 8:26; 10:3). అవి క్రైస్తవ పద్ధతి, పని, మరియు శోధనలను గమనిస్తాయి (1 కొరింథీ. 4:9; 11:10; ఎఫెసీ. 3:10; 1 పేతురు 1:12). అపాయకరమైన పరిస్థితులలో అవి ప్రోత్సహిస్తాయి (అపొ. 27:23-24). మరణ సమయంలో నీతిమంతుల శ్రద్ధ వహిస్తాయి (లూకా 16:22).

దేవదూతలు మానవుల కంటే పూర్తిగా భిన్నమైన జీవులు. మానవులు మరణించిన తరువాత దేవదూతలు కారు. దేవదూతలు ఎన్నడు మానవులు కావు, కాలేవు. దేవుడు మానవులను సృష్టించినట్లే దేవదూతలను సృష్టించాడు. మానవుల వలె దేవదూతలు దేవుని యొక్క రూపులోను పోలికలోను సృష్టించబడినాయని బైబిల్ లో ఎక్కడా చెప్పబడలేదు (ఆది. 1:26). దేవదూతలు కొంత వరకు శరీర పోలికను ధరించగల ఆత్మీయ జీవులు. మానవులు ఆత్మీయ కోణము కలిగి ప్రాథమికముగా శారీరక జీవులు. దేవుని ఆజ్ఞలకు త్వరిత, షరతులులేని విధేయత చూపుట పరిశుద్ధ దూతల నుండి మనం నేర్చుకొనదగిన గొప్ప విషయం.
The question is: what the Bible says about angels? Answer: angels, knowledge, emotions, and will contain a personal spiritual creatures. Good and evil angels (demons) are alike. And with the knowledge of the angels (Matthew 8:29; 2 Cor. 11: 3; 1 Peter 1:12), emotional crow (Luke 2:13; James 2:19; Revelation 12:17), and using the will (Luke 8:28 -31; 2 Timothy 2:26; Jude 6). Angels are spiritual creatures who do not have a real level (Heb. 1:14). Although their bodies, and even personalities. Since they are created, their knowledge is limited. God knows all the facts known to them (Matthew 24:36). However, they may have greater knowledge than humans, and it may be due to three reasons. First, angels than human beings created the great creatures. So, they got more knowledge. The second, more thorough than humans and the world of angels, read the Bible and sampadincagalavu knowledge from it (James 2:19; Revelation 12:12). Thirdly, human actions can take a lengthy to see the wisdom of the angels. Like humans, angels do not work in the past tense to read; They experienced it. So, how others react to various situations and make them aware of how each works and how we react to such situations they pravacincagalavu sure. Like other living organisms, despite the own will of the angels, they are the will of God deserving. Good angels sent by God to help believers (Heb. 1:14). Suggested things to angels in the Bible: They praise God (Psalm 148: 1-2; Isaiah 6: 3). They worship God (Heb. 1: 6; Revelation 5: 8-13). They'll be happy to work for God (Job 38: 6-7). They serve God (Psalm 103: 20; Revelation 22: 9). They appear before God (Job 1: 6; 2: 1). They are tools of God's judgment (Revelation 7: 1; 8: 2). They give answers to prayer (Acts. 12: 5-10). Gelacutalo they help people to Christ (Acts. 8:26; 10: 3). The Christian way, to work, and monitor what they see searches (1 Cor. 4: 9; 11:10; Ephesians. 3:10; 1 Peter 1:12). They encourage dangerous circumstances (Acts. 27: 23-24). Take care of the righteous at the time of death (Luke 16:22). The angels are completely different creatures than humans. After the death of human beings are angels. Humans are never angels, can not. God created human beings establishes angels. Like humans, angels were created polikalonu rupulonu of God is never in the Bible (Gen. 1:26). Some angels are spiritual creatures as appropriate comparison is to the body. The basic physical creatures, humans have a spiritual angle. Quick commands of God, unconditional obedience from the flow of the holy angels and the great thing is that we nercukonadagina.

Saturday, 18 March 2017

Facebook Christhu power gospel ministry page

https://m.facebook.com/Christhu-Power-Gospel-Ministry-Cherlapalem-1709905629238893/?ref=bookmarks

YOUTUBE christhu power gospel ministry channel

యేసు దేవుడేనా? యేసు తాను దేవుడనని ఎప్పుడైనా అన్నాడా

ప్రశ్న: యేసు దేవుడేనా? యేసు తాను దేవుడనని ఎప్పుడైనా అన్నాడా?

జవాబు: “నేను దేవుడను” అను ఖచ్చితమైన మాటలను యేసు చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంధంలో ఎక్కడా నమోదు చేయబడలేదు. అలాగంటే, ఆయన దేవుడను కానని చెప్పినట్లుగా కాదు. ఉదాహరణకు యోహాను 10:30లో యేసు పలికిన మాటలను తీసుకోండి, “నేనును తండ్రియును ఏకమైయున్నాము.” ఆయన చెప్పిన ఈ మాటకు ఆయన స్పందనను తీసుకుంటే ఆయన దేవుడనని చెప్తున్నట్లుగా ఉంది. ఈ కారణము చేతనే అక్కడివారు ఆయనను రాళ్ళతో కొట్టుటకు సిద్ధమయ్యారు “...నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు” అన్నారు (యోహాను 10:33). యేసు ఏమి చేపున్నాడో యూదులు ఖచ్చితంగా అర్ధం చేసుకున్నారు – తను దేవుడనని. దేవునిగా ఆయన చెప్పుకొనుటను ఆయన విస్మరించలేదు. “నేనును తండ్రియును ఏకమైయున్నాము” అని ఆయన చెప్పినప్పుడు ఆయన మరియు తండ్రి ఇద్దరు ఒకే స్వభావము మరియు మూలమును కలిగియున్నారని ఆయన అర్ధము. యోహాను 8:58లో ఇంకొక ఉదాహరణ ఉంది. యేసు చెప్పాడు “అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను!” ఈ వాక్యమును విన్న యూదుల యొక్క స్పందన ఏమంటే దేవదూషణ చేయుచున్నాడని, మోషే ధర్మశాస్త్రము వారిని నిర్దేశించినట్లుగా ఆయనను చంపుటకు (లేవీయ. 24:15) రాళ్ళు తీసుకొనబోయారు.

యేసు యొక్క దైవత్వమును యోహాను పునరుద్ఘాటిస్తున్నాడు: “వాక్యమే దేవుడైయుండెను” మరియు “వాక్యము శరీరధారి యాయెను” (యోహాను 1:1, 14). యేసు శరీరములో ఉన్న దేవుడని ఈ వచనములు స్పష్టంగా సూచిస్తున్నాయి. అపొస్తలుల కార్యములు 20:28లో “దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ... జాగ్రత్తగా ఉండుడి” అని చదువుతాం. సంఘమును – దేవుని సంఘమును – తన స్వరక్తమిచ్చి కొన్నది ఎవరు? యేసు క్రీస్తు. అపొస్తలుల కార్యములు 20:28 దేవుడు సంఘమును తాన సొంత రక్తము ఇచ్చి కొన్నాడని చెప్తుంది. కాబట్టి యేసు దేవుడే!

శిష్యుడైన తోమా యేసును గూర్చి చెప్పాడు, “నా ప్రభువా మరియు నా దేవా” అని (యోహాను 20:28). యేసు ఆయనను సరిచేయలేదు. తీతుకు 2:13 మన దేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టమని ప్రోత్సహిస్తుంది (2 పేతురు 1:1 కూడా చూడండి). హెబ్రీ పత్రిక 1:8లో యేసును గూర్చి తండ్రి మాట్లాడుతూ, “తన కుమారుని గూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది” అని అన్నాడు. తండ్రి యేసును “దేవా” అని సంబోధించడం యేసు నిజముగా దేవుడేనని సూచిస్తుంది.

ప్రకటన గ్రంధంలో దూత అపొస్తలుడైన యోహానును దేవుని మాత్రమే ఆరాధించమని ఉపదేశించింది (ప్రకటన 19:10). లేఖనములలో పలుమార్లు యేసు ఆరాధనను అందుకున్నాడు (మత్తయి 2:11, 14:33, 28:9, లూకా 24:52; యోహాను 9:38). ఆయనను ఆరాధించినందుకు ఎప్పుడు ప్రజలను ఆయన గద్దించలేదు. యేసు ఒకవేళ దేవుడు కాకపోతే, ఆయనను ఆరాధించవద్దని ప్రజలకు, అంటే ప్రకటన గ్రంధంలో ఆ దూత చెప్పినట్లుగానే, చెప్పేవాడు. యేసు దైవత్వమును గూర్చి వాదించి మాట్లాడే అనేక ఇతర వచనములు వాక్యభాగములు లేఖనాల్లో ఉన్నాయి.

యేసు తప్పకుండా దేవుడే అయి ఉండవలసిన ప్రాముఖ్యమైన కారణం ఏమంటే ఒకవేళ ఆయన దేవుడు కాకపొతే, ఈ లోకపు పాపములను పరిహరించుటకు ఆయన చెల్లించిన క్రయధనము సరిపోయేది కాదు (1 యోహాను 2:2). సృష్టించబడిన వ్యక్తి, అంటే యేసు ఒకవేళ దేవుడు కాకుంటే ఇదే అయి ఉంటాడు, అనంతమైన దేవునికి పాపమును బట్టి చెల్లించవలసిన అనంతమైన క్రయధనమును చెల్లించలేడు. దేవుడు మాత్రమే లోకపు పాపములను మోసికొనగలడు (2 కొరింథీ. 5:21), మరణించి, పునరుత్ధానుడై లేచి, పాపము మరియు మరణముపై తన విజయాన్ని

Tuesday, 14 March 2017

ప్రశ్న: ఒక మంచి తల్లి తండ్రిగా ఉండుట గూర్చి బైబిలు ఏమి చెప్తుంది?

జవాబు: పిల్లల పెంపకం అనేది ఒక కష్టమైన మరియు సవాలు కలిగిన వెంచర్, కాని అదే సమయంలో అది మనము చేయకలిగిన చాలా ఫలవంతమైన మరియు పరిపూర్ణమైన పని. మన పిల్లలను దేవుని యొక్క స్త్రీలు మరియు పురుషులుగా విజయవంతముగా పెంచడం గూర్చి బైబిలు ఒక గొప్ప విషయమును చెప్పును. మనము చేయవలసిన మొదటి విషయము వారికి దేవుని వాక్యమును గూర్చిన సత్యమును బోధించాలి.

దేవుని ప్రేమించడంతో పాటుగా మరియు ఆయన ఆజ్ఞలకు మనలనుమనము లోబడేలా దైవిక ఉదాహరణగా ఉండాలి, ద్వితీ. 6:7-9 ఆజ్ఞను మనము వినవలసిన అవసరం వుంది అలాగే మన పిల్లలకు చేయమని చెప్పాలి. ఈ ప్రకరణము, అలాంటి ఉపదేశమునకు నిరంతర వర్ణన ఇచ్చును. అది ఎల్లప్పుడు జరగాలి- ఇంటిలో, రహదారిపై, రాత్రిలో, మరియు ఉదయము. మన గృహాలకు బైబిలు సంబంధమైన సత్యము పునాదిగా ఉండాలి. ఈ ఆజ్ఞల యొక్క నియమాలను అనుసరించినప్పుడు, మనము మన పిల్లలకు దేవుని ఆరాధించుట స్థిరముగా ఉండాలి, కేవలం ఆదివారం ఉదయం లేక రాతి ప్రార్థనలకు ప్రత్యేకించినది కాదు అని బోధిస్తాము.

ప్రత్యక్ష బోధన ద్వారా మన పిల్లలు ఒక గొప్ప విషయాన్ని నేర్చుకొనినప్పటికీ, వారు మనలను చూచుట ద్వారా మరింతగా నేర్చుకొనును. ఇందువలన మనము, మనము చేసే ప్రతిదానిలో జాగ్రత్తపడవలెను. మొదటిగా మనము దేవుడు మనకిచ్చిన పాత్రలను గుర్తించాలి. భార్య భర్తలు ఒకరిపట్ల ఒకరు గౌరవంకలిగి మరియు లోబడియుండాలి (ఎఫెసీ. 5:21). అదే సమయంలో, దేవుడు క్రమమును ఉంచుటకు అధికారమనే గీతను స్థాపించెను. “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను” (1 కొరింథీ. 11:3). క్రీస్తు దేవునికి తక్కువ కాదని మనకు తెలుసు, అలాగే భార్య తన భర్తకు తక్కువ కాదు. దేవుడు, ఏదైనప్పటికీ, అధికారమునకు లోబడకపోతే, క్రమము ఉండదని గుర్తించెను. ఇంటి శిరస్సుగా భర్త బాధ్యత తన భార్యను తన స్వంత శరీరమును ప్రేమించుకొనుచున్నట్లు ప్రేమించ వలసిన బాధ్యత ఉంది, అదే త్యాగపూరిత విధానములో క్రీస్తు సంఘమును ప్రేమించెను (ఎఫెసీ. 5:25-29).

ఈ ప్రేమగల నాయకత్వమునకు స్పందనగా, భార్యకు భర్త యొక్క అధికారమునకు లోబడుట కష్టము కాదు (ఎఫెసీ. 5:24; కొలస్సీ. 3:18). ఆమె ప్రాధమిక బాధ్యత తన భర్తను ప్రేమించి మరియు గౌరవించుట, జ్ఞానము మరియు పవిత్రతలో జీవించుట, మరియు గృహ బాధ్యతలను నిర్వర్తించుట (తీతు 2:4-5). స్త్రీలు పెంచుటలో సహజముగా పురుషులకన్నా ఎక్కువ ఎందుకంటే వారు వారి పిల్లల ప్రాధమిక సంరక్షకులుగా నిర్మిoమపబడ్డారు.

క్రమశిక్షణ మరియు సూచన పెంపకములో సమగ్ర భాగాలు. సామెతలు 13:24 చెప్పును, “బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.” క్రమశిక్షణలేని గృహసముదాయాలలో పెరిగిన పిల్లలు అవసరంలేని మరియు విలువలేని వారిగా భావించును. వారికి దిశ మరియు స్వయo నియంత్రణ కొదువగా వుండి, మరియు వారు పెద్దవారగుచుండగా వారు తిరగబడి, మరియు ఏవిధమైన అధికారమునకు కొంచము లేక అసలు మర్యాద, దేవునితో కూడా కలిపి ఉండదు. “బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు” (సామెతలు 19:18). అదే సమయంలో, క్రమశిక్షణ ప్రేమతో సరితూగాలి, లేకపోతే పిల్లలు వ్యతిరేకముగా, నిరుత్సాహముతో, మరియు తిరుగుబాటుగా ఎదుగుదురు (కొలస్సీ. 3:21). దేవుడు క్రమశిక్షణను అది జరిగేటప్పుడు దుఃఖకరముగా గుర్తించును (హెబ్రీ. 12:11), కాని ఒకవేళ అది ప్రేమగల సూచనతో ఉంటే, అది బాలునికి చెప్పుకోదగిన లాభదాయకంగా ఉండును. “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి” (ఎఫెసీ. 6:4).

పిల్లలను సంఘ కుటుంబములోను మరియు పరిచర్యలోను వారు యవ్వనులుగా ఉన్నప్పుడే పాలుపంపులు పొందేలా చేయాలి. క్రమముగా ఒక బైబిలును నమ్మే సంఘమునకు హాజరగుట (హెబ్రీ. 10:25), నీవు వాక్యము చదువుచుండగా చూచుటకు వారిని అనుమతించుట, మరియు వారితో కలిసి చదువుట. వారితో వారిచుట్టు నున్న ప్రపంచము గూర్చి వారు చూచే విధానములో చర్చించుట, మరియు ప్రతిదిన జీవితంలో దేవుని మహిమను గూర్చి వారికి బోధించుట. “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు” (సామెతలు 22:6). ఒక మంచి తల్లి తండ్రిగా ఉండటం అంటే ప్రభువుకు విధేయత చూపి మరియు ఆరాధించే నీ ఉదాహరణను అనుసరించు పిల్లలను పెంచుట.

ప్రశ్న: వివిధ జాతుల యొక్క మూలము ఏమిటి?

జవాబు: మానవాళిలోని వివిధ“జాతుల” యొక్క లేదా చర్మపు రంగుల యొక్క మూలములను గూర్చి పరిశుద్ధ గ్రంధము అంత స్పష్టముగా ఏమి చెప్పుటలేదు. వాస్తవములో, అసలు ఉన్నది ఒకే జాతి – అదే మానవ జాతి. ఈ మానవ జాతిలోనే చర్మపు రంగులోను ఇతర భౌతిక లక్షణములలోను కొంచెం భిన్నత్వము ఉంది. దేవుడు బాబెలు గోపురము కథనములో భాషలను తారుమారు చేసినప్పుడు (ఆదికాండము 11:1-9), జాతుల భిన్నత్వమును కూడా సృష్టించాడు అని కొందరు ఊహిస్తారు. వివిధ రకములైన పర్యావరణ వాతావరణములలో మానవులు జీవించుటకు వీలగునట్లు దేవుడు కొన్ని జన్యుపరమైన మార్పులు చేసి ఉండవచ్చు, అంటే ఆఫ్రికా దేశస్థులు ఆ ప్రాంతములో ఉండే అధిక వేడిమిని తట్టుకొనునట్లు జన్యుపరముగా అలా రూపొందించబడి ఉంటారు. ఈ ఆలోచన ప్రకారముగా, దేవుడు భాషలను తారుమారు చేసి, భాషల ప్రాతిపదికన వారు విభజించుకొనునట్లు చేసి, ఆ తరువాత ఈ ప్రతి భాష గుంపు వారు ఎక్కడ తమ నివాసములను ఏర్పరచుకున్నారో దానిని బట్టి వారిని జన్యుపరముగా తయారు చేసాడు అని అంటారు. ఇది సాధ్యపడు ఆలోచనే అయినను, ఈ ఆలోచన కొరకు స్పష్టమైన పరిశుద్ధ గ్రంధపు ఆధారము ఏమి లేదు. మానవాళి యొక్క జాతులు/చర్మపు రంగులు బాబెలు గోపురము నేపథ్యములో ఎక్కడా కూడా అనుసంధానముగా మాట్లాడబడలేదు.

జలప్రళయము తరువాత, వివిధ భాషలు మనుగడలోనికి వచ్చినప్పుడు, ఒకే భాషను మాట్లాడే ఒక గుంపు అదే భాష మాట్లాడే వేరొక గుంపుతో కలిసి దూరంగా వెళ్ళిపోయింది. ఈ విధంగా చేయుటద్వారా, ఇతర మానవ జనాభాతో వారు కలుసుకొనుటకు వీలు లేనందున వారి యొక్క జన్యుపరమైన లక్షణములు క్రమేణా కుంచించుకునిపోయాయి. దగ్గరగా సంకరణము జరిగి, తరువాత కాలగమనంలో ఈ వివిధ గుంపులలో కొన్ని లక్షణాలు ఉద్ఘాటించబడ్డాయి (ఇవన్నియు వారి వారి జన్యు స్మృతులలో ఉన్నాయి). తదుపరి సంకరణము జరగగా, ఆ జన్యు లక్షణములు ఇంకను చిన్నదిగా మారి, ఒకే భాష మాట్లాడే ప్రజలందరికి ఒకేవిధమైన లేదా ఒకేలాగ ఉండే లక్షణములు సంక్రమించడం జరిగింది.

మరొక వివరణ ఏమంటే నలుపు జాతీయులను, ఎరుపు జాతీయులను, తెలుపు జాతీయులను (మరియు వీరికి మధ్యస్థంగా ఉండే రంగులను కూడా) ఉత్పత్తి చేయుటకు ఆదాము మరియు హవ్వలు ఆ జన్యులను వారిలోనే కలిగియున్నారు అనే వాదన. సంకర జాతి దంపతులకు కొన్నిసార్లు వేరే రంగులో ఉన్న బిడ్డలు పుట్టినట్లుగానే ఇది ఉంటుంది. మానవాళి అంతయు కనిపించుటలో స్పష్టమైన భిన్నత్వములను కలిగియుండాలని దేవుడు భావించాడు గనుక, వివిధ చర్మపు రంగులు కలిగిన బిడ్డలను కనుటకు దేవుడు ఆదాము మరియు హవ్వలకే ఆ సామర్ధ్యతను ఇచ్చాడు అనుటలో అర్ధం ఉంటుంది. తరువాత, జలప్రళయమును తట్టుకొని బ్రతికిన వారు కేవలం నోవాహు మరియు తన భార్య, నోవహు యొక్క ముగ్గురు కుమారులు వారి భార్యలు – మొత్తం ఎనిమిది మంది మాత్రమే (ఆదికాండము 7:13). బహుశా నోవహు యొక్క కోడళ్ళు వేరే జాతికి చెందినవారు కావచ్చు. నోవహు యొక్క భార్య కూడా నోవహు కంటే కూడా వేరే జాతికి చెందినదై ఉంటుంది. బహుశ వారు ఎనిమిది మంది కూడా సంకర జాతివారైయుండవచ్చు, అంటే వివిధ జాతులను ఉత్పన్నం చేయుటకు వారిలో జన్యువులు ఉన్నాయని దీని అర్ధము. వివరణ ఏదైనా కావచ్చు, ఈప్రశ్నలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏమంటే మనమందరమూ ఒక జాతివారము, ఒకే దేవుని ద్వారా సృష్టింపబడ్డాము, మరియు ఒకే ఉద్దేశము కొరకు – అనగా ఆయనను స్తుతించుటకు – సృష్టింపబడ్డాము.